Sunday, October 17, 2010

అదన్నమాట! : అక్టోబర్ 10-16

రైతుల ఆత్మహత్యలు గురుంచి మనం వింటూనే ఉన్నాం.కాని, అప్పుల బాధ లో ఉన్న ఇంకో వర్గాన్ని పూర్తీ గా విస్మరించాము . రాష్ట్రం లో సూక్ష్మ రుణ సంస్థలు వారు ఇచ్చిన అప్పు ని తీర్చమని ఒత్తిడి పెంచాయి. బెదిరింపులకి దిగాయి. ఇవి అన్ని తట్టుకోలేక, పేదలు ఆత్మా హత్యలు చేసుకోవడ మొదలుపెట్టారు. రోజు రోజుకి ఈ వార్తలే బయటికి వస్తునాయి (ఎన్ని వార్తలు వచినా , సాక్షి మాత్రం ఓదార్పు యాత్ర మీదే ఫోకస్స్ ఉంచింది లెండి !). విపక్షలకి ఈ ఆత్మహత్యలతో ప్రభుత్వం పై దాడి చెయ్యడానికి ఒక కొత్త ఆయుధం దొరికింది ! ఇంకా అవి చెలరేగిపోయాయి. కాని మునపటి లాగ ప్రభుత్వం రుణ మాఫీ చేసే స్థితి లో లేదు ! అందుకే, స్వీయ సహాయ గ్రూపులు కి ఈ సూక్ష్మ రుణ సంస్థల అప్పులు తీర్చడానికి గాను ప్రభుత్వ బ్యాంకులు తక్కువ వడ్డీ కి ఋణం ఇస్తాయి అని ప్రకటించింది ! ఒక అప్పు తీర్చడానికి ఇంకో అప్పు అన్నమాట !

1 comments:

Arun said...

Rahul asked the Bihar CM him to compare Bihar's growth with the Congress-run Andhra Pradesh and not the 15-year rule of Lalu Prasad in Bihar.

Post a Comment