Sunday, March 28, 2010

అదన్నమాట!:మార్చి 21-27

1 . కథ మళ్ళి మొదటి కి వచ్చింది. ఈనాడు ఏమో ఒక రోజు జగన్ మోహన్ రెడ్డి మరియు ఇతర కుటుంబ సభ్యులు పాల్పడుతున్న అవినీతి గురుంచి పతాక శీర్షిక ఒకటి ప్రచురించింది. మరుసటి రోజు సాక్షి రామోజీ రావు మీద ఒక పతాక శీర్షిక ప్రచురించింది. అదే రోజు రాత్రి రామోజీ రావు మీద ఒక అర గంట కార్యక్రమం సాక్షి టీవీ లో ప్రసారం అయ్యింది. రాష్ట్ర ప్రజలకి తెలంగాణా అంశం నుంచి మంచి ఊరట లబించింది !

2 . ఈ కాంగ్రెస్స్ వాళ్ళు ఎంత నీచానికి ఆయినా దిగజారుతారు. రాష్ట్ర అసెంబ్లీ లో తెదేపా వాళ్ళు ఆరోపణలు ఎదురుకుంటున్న ఒక ఐ ఏ ఎస్ అధికారి కి అదనపు బాధ్యతలు ఎలా ఇస్తారు అని ప్రశ్నిస్తే, కాంగ్రెస్స్ వాళ్ళు లెగిసి, సదరు అధికారి, దళితుడు కాబట్టి తెదేపా ఇలా మాట్లాడుతుంది అని ఎదురు దాడి కి దిగారు ! చాలా చక్కగా విషయాన్ని మళ్ళించారు.

3 . మొన్న ఆ మధ్య మనం ఎపిపిఎస్సి లో జరిగిన అక్రమాలను చర్చించాము. ఈ వారం అసెంబ్లీ లో కూడా ఇదే చర్చా జరిగింది. ముఖ్యమంత్రి గారు విచారణ జరిపిస్తాము అని చెప్పారు. అంటే, ఇక మీదట ఈ విషయం మీద ఇంకా ఏమి చర్చా ఉండదు. విచారణ ఎలాగో ఏమి తేల్చాడు. అవినీతి అధికారులు రాజ్యం ఎలుతూనే ఉంటారు. భరించల్సింది మాత్రం సగటు విద్యార్ధి ఏ.

1 comments:

Arun said...

As against Rs 170 crore payable, Satyam paid a meagre amount of Rs 4.25 crore.

If that was not enough, the CAG also found fault with the government for awarding the work related to development of Machilipatnam port to Maytas-led consortium (Maytas was promoted by the family of the Rajus) which caused a financial liability of Rs 335 crore to the government.

Post a Comment