Sunday, June 26, 2011

అదన్నమాట! : జూన్ 19-25

తెరాసా సిద్దాంత కర్త - ప్రొఫెస్సర్ జయశంకర్ ఈ వారం కన్ను మూసారు. ప్రత్యెక తెలంగాణా రాష్ట్రం కోసం గత 60 ఏళ్ళు గా పోరాటం చేసారు ఈయన. అయితే, ఈయన భౌతిక కాయం కి చూడడానికి వచ్చిన కాంగ్రెస్స్ మరియు తెదేపా నేతలు మీద తెరాసా దుండగలు కొంత మంది దాడి చేసారు. రాజీనామాలు చేస్తే కాని ఎవ్వరు ఇక్కడ రావడానికి వీళు లేదని అని తేల్చి చెప్పేశారు. ఇలాంటి అరాచక శక్తులు ఏమి సాధిస్తాయో ఎవ్వరికి అర్ధం కావటం లేదు. అన్త్యక్రీయలు లో పాల్గొనడానికి కూడా వీళ్ళని రానివ్వలేదు. వీళ్ళు ఎంచుకున్న హింసా మార్గం ఎంత వరకు సమంజసమో వీళ్ళే ఒక్క సారి ఆలోచించుకోవాలి ....

0 comments:

Post a Comment