Sunday, January 29, 2012

అదన్నమాట! : జనవరి 22-28


"పార్టి ని అమ్ముకున్న వాళ్ళు నాన్న గారి కాలి గోటికి కి కూడా సరి తూగారు  " అని శ్రీమాన్ బాలకృష్ణ గారు చిరంజీవి ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసారు. గత రెండు వారాలు గా వీల ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ఇది చూసే వాళ్ళకి కర్చు లేని వినోదాన్ని అందించింది. బాలకృష్ణ చిన్న పిల్లడు అని చిరంజీవి అనడం, దానికి బాలయ్య "అవును, ఆయన చాలా ఎదిగాడు" అని వ్యంగ్యాస్త్రాలు సంధించడం ప్రేక్షకులకి వినోదాన్ని ఇచ్చాయి. 

ఇది ఇలా ఉండగా, బాలకృష్ణ క్రియాశీల రాజకీయాల లోకి పూర్తి గా వచ్చేసారు. 2014 ఎన్నికలల్లో పోటి చేస్తునట్లు ప్రకటించారు. అంతే కాకుండా, కృష్ణ మరియు విశాఖ జిల్లాలలో పర్యటించారు, కార్యకర్తలను ఉత్సాహ పరిచారు కూడా. బాలకృష్ణ రావడం తో కోస్తా, రాయలసీమ లో జగన్ పార్టి కి తెదేపా గట్టి పోటి ఇవ్వడానికి సిద్దం అయ్యింది. కాంగ్రెస్స్ ఎలాగో తన కొంప కొల్లేరు చేసుకుంటుంది - కాబట్టి రాబోయే ఉప ఎన్నికలల్లో పోటి కేవలం జగన్ కి తెదేపా కి ఉంటుంది. 

ఉప ఎన్నికలు అంటే గుర్తు వచ్చింది అండి - మన స్పీకర్ గారు ఇంకా ఆ 17 ఎమఎల్యేలను బర్తరఫ్ చెయ్యలేదు ! ఎంత సాగాతీస్తే అంత మంచిది అని అనుకుంటునారు ఏమో! సాగాతీసేకొడ్డి నష్టపోయేది కాంగ్రెస్స్ పార్టి ఈ కదా! అదన్నమాట! 

0 comments:

Post a Comment